ఎంటీ ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటుదక్కటానికి తాజ్ కు ఓటెయ్యాలా – ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు - నేను వెయ్యను , తాజ్మహల్కు ఓటెయ్యాలా – ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు - నేను వెయ్యను ,
ఈ మద్య ఇది బాగాపెరిగి పోయినది “ప్రపంచంలోని ఏడు వింతల్లో భారత్కు చెందిన చారిత్రాత్మక కట్టడం తాజ్మహల్కు చోటు దక్కుతుందా అనే విషయం ఆగమ్యగోచరంగా ఉంది. ఇందుకు కారణం ఇటీవల నిర్వహిస్తున్న ఆన్లైన్ సర్వేలో ప్రస్తుతం ఉన్న ఏడు వింతలపై ప్రజాభిప్రాయ సేకరణ తాజ్మహల్కు భిన్నంగా ఉండటమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కట్టడాలపై నిర్వహిస్తున్న సర్వేలో మొత్తం 21 కట్టడాలు తుదిగా నిలిచాయి. ప్రస్తుతం ఏడో వింతగా ఉన్న తాజ్మహల్ ఆ జాబితా నుంచి తప్పుకుంది. అయితే తాజ్మహల్కు ఓటు వెయవలసినది గా అబ్యర్దిస్తూ జాబులు SMS వస్తున్నాయి.అసలు ఈ ఓటంగ్ సరళి చాలా విచిత్రంగా ఉన్నది దీని కోసము మీకు Internet accout గాని Mobile Phone గాని వుండాలి
, మీకు ఓటు వెసిన రుజువు కోసం Certificate voting కు US$2,లేదా దీనికో సము +423 663 90 02 99 call చేయాలటలేదా on line లో, ఎన్ను కోవాలట ,SMS ద్వారా కూడా ఎన్నుకో వచ్చట అన్నిపక్రియలు వ్యయపూరిత మయినవి పైగా ఇది ఒక వ్యక్తిగత చిట్టా ఇలా మనం ఎవరన్నా చిట్టాలు తయారు చేయవచ్చు ఇలాంటివి వుపయోగించి ప్రజల మానసిక ఉద్వేగాలను చక్కగా సోమ్ము చేసుకోవచ్చు ఇంకా బోలేడు జాబితా (data), ప్రచారం కూడా లబిస్తుంది. ఇక విషయానికి వస్తే ఈ ఓటింగు పూర్తి గా ఒక గిమ్మిక్కు ,ఇది ఒక swiss కంపెనీ వాడి మాయ వీడు http://www.new7wonders.com/ పేరుతో ఒక టూర్ నడుపుతూ ఉంటాడు వీడు మన తాజ్మహల్ అబివ్రుద్దికి ఒక్క డాలరు కూడా ఇవ్వడు అంతే కాక దీనిపై సర్వే నిర్వహిస్తున్న బెర్నార్డ్ వెర్బర్ చెపితేనే తాజ్మహల్ కు కోత్తగా వచ్చేదేమి లేదు , అసలు UNESCO వాడికే మన తాజ్ గురించి మాట్లాడే అధికారంలేదు.ఇలాంటి పనికి రానివిషయాలి మీద మన మీడియా ప్రత్యేక మమకారం అసలు ఒక విషయంగురించి మాట్లాడేటప్పుడు సరి అయిన పరిశోదన చేసి విచక్షణ తో ఎందుకు స్పందించరు ? ఖర్మకాలి మన ప్రర్యాటక మంత్రి అంబికా సోని గారు మీడియా సమక్షలో SMS ద్వారా ఓటు వేసారు ఆ మూడు రూపాయలను తాజ్మహల్ అభివృద్దికి వెచ్చించినా ఈపాటికి కోన్నిలక్షల రూపాయలు జమఅయ్యేవి .
PS : ఇది రాసే సమయానికి Lisbon వాడు తుదిజాబితా ప్రకటించటానికి ఇంకా 11 రోజుల 11 గంటల సమయం మిగిలి వున్నది.దయచేసి ఈవేలంవెర్రి గురించి be MAD! (Make A Difference )









నేనుసైతం చెప్పబడిన
ఒకవైపు తాజ్ అందాలను నాశనం చేసే తాజ్ కారిడార్ల ద్వారా కోట్లు దోచేస్తూ, మరో వైపు తాజ్ కి ఓటు వెయ్యమనటం హాస్యాస్పదం.
( మీరు తాజ్ ని ఇస్టపడుతున్నారా లేదు అన్నది వేరే విషయం. నా వరకు నాకు, భార్య జ్నాపకార్దం ప్రజల సొమ్ముతో కట్టడం కట్టించిన షాజహాన్ కన్నా, ఉన్న వూరి నుండి వైద్యానికి దారిలేక మరణించిన తన భార్య జ్నాపకార్దం ఒంటరిగా కొండను తొలిచి ఉరికి దారి ఏర్పరచిన బీహారు కి చెందిన సమాన్యుడే గొప్ప. ( ఈ వార్త పేపరు లో చదివాను, కాని ఎప్పుడు చదివానో గుర్తు లేదు…క్షమించాలి)
-నేనుసైతం
nagaraja చెప్పబడిన
అతని పేరు దశరథ్ అట! http://www.patnadaily.com/readerswrite/2006/jul/indra28.html